Search This Blog

Friday, September 30, 2011

తొలి వరం...


నీ చేయి తాకిన ఆ క్షణం
నా తనువులోని అణువణువు
అరవిరిసిన కుసుమం.,
తొలొ స్పర్శలోని ఆ తీయదనం
నా మనసుకే తొలి కల 'వరం'
తెలియని అలజడి ఏదో నాలో రేగి
ఝల్లున పొంగింది విరహాల గోదారి !!
 

Thursday, September 29, 2011

ఈ రోజు మా చెల్లి స్వప్న పుట్టిన రోజు..

పువ్వులలో నవ్వులు..జాబిలిలో వెన్నెలలు
కోయిలమ్మ పాట.. పారే సెలయేరు
నా ఈ పుట్టిన రోజు శుభాకాంక్షలు
నీ జీవితంలో అడుగడుగునా
వెలుగులు నింపాలని అశిస్తున్నా..!
నాని తల్లి పుట్టిన రోజు సుభాకాంక్షలు.

Wednesday, September 28, 2011

ప్రజా క్షేమమే ముఖ్యం కావాలి


ఒకప్పుడు మన దేశంలో మద్య నిషేధం అమలులో ఉండేది. మద్య నిషేధం వల్ల ఖజానాకి గండి పడిపోయి ప్రభుత్వం దివాలా తీస్తుంది. సంక్షేమ పథకాలని కొనసాగించడానికి డబ్బు ఉండదు అంటూ చాలా చోట్ల మద్య నిషేధం ఎత్తేసారు.
రాష్ట్ర ప్రభుత్వం వేలం పాటలు పాడి లిక్కర్ షాపులకి అనుమతి ఎచ్చింది. అన్ని ఊళ్ళలో మందు బాబులు, ప్రభుత్వం అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ ఖజానా నిండుగా ఉంది. మందు బాబులు పీకల దాకా తాగి వీధుల్లో భరత నాట్యం, ఇంట్లో కలహ నాట్యం చేస్తున్నారు.
'లిక్కర్ షాపులని కొన్ని నిబంధనలకి కట్టుబడి నడపాలి.లైసెన్సులు ఇచ్చే ముందుకండీషన్లు జారీ చేసాము. నిబంధనలని ఉల్లంఘిస్తే షాపులు మూయించి, లైసెన్సులు రద్దు చేస్తామూ అంటూ శాసన సభల్లో గొంతు చించుకు అరుస్తుంటారు మన రాజకీయవాదులు. కాని వాస్తవానికి తాము విధించిన నిబంధనలని ఎంత వరకు లిక్కర్ షాపులు అమలు చేస్తున్నాయి అన్నది పరిశీలించక ఆ బాధ్యత మధ్యవర్తులకి వదిలేస్తున్నారు. 
స్కూళ్ళు,కాలేజీలు,కుటుంబాలు నివసించే ప్రాంతాలు,  మసీదులు, చర్చిలు, గుళ్ళు  గోపురాలు, భజన మందిరాలు, మఠాలు- వీటి చుట్టు పక్క్ల లిక్కర్ షాపులు ఉండకూడదు. రెండు కిలోమీటర్ల దూరాన ఉండాలి తప్ప సామాన్య ప్రజలకి- స్త్రీలు, పిల్లలకు ఇబ్బంది కలిగేటట్లు ఉంచకూడదు. అర్ధరాత్రి దాక వీటిని తెరిచి ఉంచకూడదు అని కూడా నిబంధన ఉంది.
ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి. ఎవరూ కాదనరు. అందుకని లిక్కర్ షాపులు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నప్పుడు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఈ షాపులు ఎక్కడ, ఎలా నడుపుతున్నారో నిఘా వేసి ఇరవై నాలుగు గంటలూ ప్రభుత్వం, పోలీసులూ ఒక కన్నేసి ఉంచాలి. ఇటువంటి షాపులను మూయించటమే కాదు, ఆ షాపు వాళ్ళ లైసెన్సు రద్దు చేసి కటకటాల వెనక కూర్చోబెట్టాలి.
ప్రభుత్వం డబ్బు దండుకోవడంలో చూపే చొరవ, ప్రజల క్షేమం పట్ల కూడా చూపించాలి. ప్రజా క్షేమమే ముఖ్యం కావాలి. ___  మాలతీ చందూర్.   

Tuesday, September 27, 2011

విజయం నీదే...

వాడిపోయిన మొక్క సహితం
నీరు పోస్తే చిగురిస్తుంది.,
రెక్క తెగిన పక్షి సైతం
గూటిని చేరడానికి శ్రమిస్తుంది.,
తగిలిన ప్రతి గాయం
ఒక క్రొత్త పాఠం నేర్చుకోవడానికి అవకాశమిస్తుంది
ప్రతి లక్ష్యానికి ఒక గమ్యం ఏర్పరుస్తుంది
ఒక కొత్త ఆశని రేకెత్తిస్తుంది.,
విజయం నిన్ను వరించట్లేదనకు
ప్రతి క్షణం పోరాడు
అనుక్షణం శ్రమించు
నీ దరికి రానంటుంది ఏ అపజయం
నిన్ను వదిలి పోనంటుంది ఏ నిమిషం ! !

Monday, September 26, 2011

బాల్యం...



చిన్ననాటి నా తలపుల నావలు
పయనించెను ఎచటికో తెలియని దిక్కుల
తీరమెరుగని గమ్యంలా..! 

Wednesday, September 21, 2011

శూన్యం...

వయసెందుకు ?
వలపెందుకు ?
మనసెందుకు ?
మరులెందుకు ?
నువ్వు లేని వేళ
అంతా శూన్యం నేస్తమా ! !

Monday, September 19, 2011

వార్ధక్యం లేని మనసు...

జీవితం ఒక నది లాంటిది. నిరంతరం కదిలిపోతూ, అన్వేషిస్తూ, పరిశోధిస్తూ, ముందుకు త్రోసుకునిపోతూ, గట్లు పొర్లి పారుతూ,ఎక్కడ సందున్నా జొరబడుతూ, నీళ్ళతో నింపుతూ ప్రవహిస్తుంటుంది.
కాని చూసారా, మన మనస్సు తానా విధంగా అంటె నది వలె వుండడం నచ్చదు. శాశ్వతము, స్థిరము, కానట్టి ఏ విధమైన భద్రతా లేనట్టి స్థితిలో జీవించడమంటే మనస్సుకు చాలా ప్రమాదకరంగా తోస్తుంది. అందువల్ల తన చుట్టూ తనొక గోడను నిర్మించుకుంటుంది. అదే సంప్రదాయమనే గోడ. వ్యవస్థీకృతమనే గోడ. సాంఘిక, రాజకీయ సిద్ధాతములనే గోడ.  
కుటుంబం, పేరు ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు, అలవరుచుకున్న కొన్ని సద్గుణములు, ఇవన్నీ జీవితానికి దూరంగా, ఆ గోడలలో చేరి ఉంటాయి. కాని జీవితమో- కదిలిపోతూ ఉంటుంది. అది శాశ్వతంగా ఒకే చోట అట్లే నిలిచి ఉండదు. అది ఈ గోడ లోనికి ప్రవేశించి, వాటిని కూలద్రోయదం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది.
ఆ గోడల వెనుక గందరగోళం, కలవరపాటు, దైన్యం రాజ్యం చేస్తూనే ఉంటాయి. అక్కడి దేవతలు దొంగ దేవతలు. వారి శాస్త్ర గ్రంధాలు, వేదాంతం అర్ధం లేనిది.  
జీవితం వీటన్నిటికంటే అతీతం. ఐతే అటువంటి  అడ్డు గోడలు లేని మనస్సుకు, తానార్జించి కూడబెట్టుకున్న విషయాల చేత, తన జ్ణాన వైదుష్యాల భారం చేత కృంగిపోని మనస్సుకు, కాలానికి అతీతంగా ఉంటూ, తనకు భద్రతను కోరుకోకుండా జీవించే మనస్సునకు జీవితమనేది ఒక అద్భుతమైన
విషయంగా  తోస్తుంది. అసలా మనస్సే జీవితం.
మనస్సు తప్ప జీవితానికి వేరే నీడ లేదు. కాని మనసులో చాలా మందికి నీడ కావాలి, విడిది కావాలి. అది ఒక చిన్న ఇల్లో. పేరు ప్రతిష్టలో, పదవులో ఏదయినా కావచ్చు . అందువల్ల మనకివన్నీ ముఖ్యమైనవిగా తోస్తాయి.
మనం స్థిరంగా, శాశ్వతంగా ఉండటం కోరతాం. దానికనుకూలమైన సంస్కృతినే  అభివృద్దిపరుస్తాం. అందుకోసం దేవతల్ని సృష్టిస్తాం. కాని నిజానికి వారు దేవతలు కానే కారు. వారు మన కోరికలకు మారు రూపాలు- అంత మాత్రమే.
పూర్తిగా జీవిత ప్రవాహంతో పాటే కదులుతూ, కాలగమనంతో సంబంధం లేకుండా, ముందు ముందుకు త్రోసుకుపోతూ, అన్వేషణ గావిస్తూ, భగ్గుమని ప్రజ్వరిల్లుతూ, బ్రద్దలవుతూ ఉండే విశ్రాంతి లేని మనస్సు మాత్రమే ఆనందానికి నిలయమౌతుంది.
అటువంటి మనస్సు సృజనాత్మకము కాబట్టి అది నిత్య నూతనం. దానికి వార్ధక్యమనేది రాదు. _ జిడ్డు కృష్ణమూర్తి. 

సంగ్రహణము : స్వాతి  సపరివార పత్రిక.      

Sunday, September 18, 2011

ఆవేదన...

పూల గుస గుసలు తుమ్మెదకే తెలుసు
కెరటం పడే ఆరాటం తీరానికే తెలుసు
తీవెలలో ఆలాపన కొమ్మలకే తెలుసు
కోయిల పిలుపులోని మాధుర్యం ఆమనికే తెలుసు..,
ఆ పువ్వులు నీ పెదవులపై
నవ్వులుగా విరబూయాలని.,
నీవు పిలిచే పిలుపు కోసం
ఆమనిలా వేచి వుంటానని.,
కనుల కడలిలో కెరటమై
నీ చూపుల తీరాన్ని తాకాలని
మరి నేను పడే ఆవేదన
నీకెలా తెలుస్తుంది నేస్తం ! ! 

Saturday, September 17, 2011

అనంత పాయ్ : (17 September 1929 – 24 February 2011)

ఈయన అందరికీ అంకుల్ పాయ్ అని తెలుసు. మంచి విద్యావేత్త, మరియు ఇండియన్ కామిక్స్ సృష్టికర్త. ఈయన జన్మస్థలం, కర్ణాటక రష్ట్రన్ లోని కార్కల. తల్లి దండ్రులు సుశీల, వెంకట రాయ. పాయ్ 2 సంవతరాల వయసులో ఉండగా తన తల్లిదండ్రులను కోల్పోయాడు.
బొంబాయి యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ లలో రెండు డిగ్రీలను అందుకున్నాడు.
పాయ్ 1967 లో సృష్టించిన "అమర్ చిత్ర కథ" యెంతో ఖ్యాతి పొందింది. ఈ పుస్తకం ఏటా 3 మిలియన్ల కాపీలు అమ్ముడ్పొతున్నాయి. ఇంగ్లీషు మరియు 20 భారతీయ భాషలలో ఈ పుస్తకం ప్రచురించబడుతోంది.
ఈయన ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్నారు. కామిక్స్ లో లైఫ్ టైం అవార్డు, విశ్వ సారస్వత సమ్మాన్, ప్రియదర్శిని అకాడమి అవార్డు, రాజా రామ్మోహన రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ అవార్డు ఇలా ఎన్నో...       

Friday, September 16, 2011

భావ వ్యక్తీకరణ

మనందరికీ చాలా రకాలైన హక్కులున్నాయి. అందులో భావాలను వ్యక్తీక్తీకరించడం ఒకటి. తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా, నిర్భయంగా వెల్లడించడం అంటే చాలా ధైర్యం కావాలి. అందుకు సరైన మాటలు కూడా కావాలి. ఇలాంటి భావ వ్యక్తీకరణలో 'విమర్శ ' చాలా ముఖ్యమైనది అని నేననుకుంటాను. విమర్శ చేయడం అన్నది కూడా ఒక కళ. ఎందుకంటే విమర్శలలో కొన్ని స్పూర్తి దాయకం గాను, కొన్ని బాధ పెట్టేవి గాను, కొన్ని సరదాగాను ఇలా పలు రకాలుగా ఉంటాయి.
అసలు ఈ అభిప్రాయాలను వెల్లడించడం అనే అంశాన్ని నేను ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. కొన్ని బ్లాగులలో విమర్శలు లేదా అభిప్రాయాలు చూస్తుంటే.. ఆయా బ్లాగర్లకి అవి ఎలా అనిపిస్తున్నాయో తెలియదు కాని నాకెందుకో బాధగా అనిపించింది. ఎందుకంటే ఆ అభిప్రాయాలు చదవడానికి వీల్లేనంతగా ఉంటున్నాయి కాబట్టి.
మేమెవరో తెలియదులే అని అలా చేస్తున్నారో, ఎలా వ్రాసినా పర్వాలేదని అనుకోవడమో తెలియదు. 
మన అభిప్రాయాలను తెలియపరిచేటపుడు మనల్ని ఏంట్రా బాబూ తింటున్నావ్ అని కాస్త సరదాగా తిడుతూ వ్రాసినా పర్వాలేదు కాని, అంత అసభ్య పద జాలాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదని నా అబిప్రాయం.  
ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళది అని అనుకునే కన్నా సరైన పదజాలం ఉపయోగిస్తే మంచిదేమొ అని అనిపిస్తుంది. చదివేవాళ్ళ మనసుకు కూడ హాయిగా అనిపిస్తుంది.
నేనేమన్నా తప్పుగా వ్రాస్తే బ్లాగర్లు, బ్లాగు చదివేవాళ్ళు మన్నించవలిసిందిగా మనవి. కాని ఒకసారి ఆలోచిస్తే కూడా మంచిదేమో అని నా అభిప్రాయం.

ఆ క్షణం కోసం ...

కలలా కనిపించావు
కలలాగే వెళ్ళిపోయావు
కలలన్నీ కల్లలు చేసి.,
కనికరమే కలగని ఈ కాలాన్ని
నా కలవరపాటు కాసింతైనా కదిలిస్తుందా? ?
నా కనులు కన్న ఆ కలని
తిరిగి కలుసుకోగలనా??
కలవరించే కన్నులకు
ఇక కలత నిదురలేనా??
 నీలో కలిసిపోయే ఆ నిమిషం కోసం
కలిసిరాని కాలాన్ని బ్రతిమాలుతున్నా నేస్తం ! !

Thursday, September 15, 2011

ఊహల ఊయల్లో...

నా ఊహల ఊయల్లో
అలవి కాని ఎన్నో అందాలు.,
నా ఆశల ఊసుల్లో పలుకలేని ఎన్నో భావాలు.,
నా కనుల కొలనుల్లో
కరిగిపోని ఎన్నో కాలాలు.,
నా జీవన వేణువులో
రవళించని ఎన్నో రాగాలు.,
విరి తేనెల మరులు కురిసి
తెలి వలపుల విరులు విరిసి
మది కోయిల పరవశించే
మధుర మకరంద క్షణాలకై
నా ఈ నిరీక్షణా వీక్షణలు . . !

Wednesday, September 14, 2011

నెచ్చెలినై...

క్షణం క్షణం
నా మనసుకు దగ్గరగా వస్తావు..
అనుక్షణం
నా తలపులలో విహరిస్తావు..
నేను పీల్చే శ్వాసల్లో
నీ పరిమళాలే వెదజల్లుతావు..
నడి రాతిరిలో
స్వప్నానివై మరలిపోతావు..
తొలి పొద్దులో
సూర్యునివై వెచ్చని మేల్కొలుపువౌతావు..
కలవో, "కల"వో.,
చెలిగా నిన్ను చేరే రోజు కోసం
"కల"వరిస్తూనే ఉంటాను నేస్తం !!